RCB | బెంగళూరు: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ప్రారంభమైనప్పటి నుంచి కప్పు కోసం చకోర పక్షిలా ఎదురుచూస్తున్న రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) ఈ సారి పక్క బందోబస్తుతో బరిలోకి దిగాలని చూస్తున్నది. ఇందులో భాగంగా శిక్షణ బృందాన్ని పూర్తిగా మార్చేసింది.
ఈ సీజన్ వరకు జట్టుతో కొనసాగిన హెడ్కోచ్ మైక్ హెసెన్, బ్యాటింగ్ కోచ్ సంజయ్ బంగార్ను పక్కన పెట్టేసింది. వీరి స్థానంలో ఫ్రాంచైజీ క్రికెట్లో విజయవంతమైన కోచ్గా పేరు తెచ్చుకున్న జింబాబ్వే మాజీ ప్లేయర్ ఆండీ ఫ్లవర్ను ప్రధాన కోచ్గా నియమించింది.