న్యూఢిల్లీ: పారిస్ ఒలింపిక్స్కు అర్హత సాధించేందుకు ఆఖరిదైన ఒలింపిక్ క్వా లిఫయిర్స్ టోర్నీ కోసం జాతీయ బాక్సింగ్ సమాఖ్య(బీఎఫ్ఐ) శనివారం మొత్తం తొమ్మిది మందితో కూడిన జట్టును ప్రకటించింది. ఇందులో ఏడుగురు పురుష బాక్సర్లతో పాటు ఇద్దరు మహిళా బాక్సర్లు ఉన్నారు. బ్యాంకాక్ వేదికగా మే 25వ తేదీ నుంచి జూన్ 2 వరకు జరిగే ఒలింపిక్ క్వాలిఫయర్స్ టోర్నీలో వీరు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు.
గత నెలలో ఇటలీలో జరిగిన క్వాలిఫయింగ్ టోర్నీలో భారత బాక్సర్లు పేలవ ప్రదర్శన కనబరుస్తూ విశ్వక్రీడలకు బెర్తులు దక్కించుకోవడంలో విఫలమయ్యారు. ఆఖరి అర్హత టోర్నీలోనైనా ఆకట్టుకుంటారా అన్నది ఆసక్తికరంగా మారింది. ఇదిలా ఉంటే జట్టులో పలు మార్పులు చేశారు. తెలంగాణ యువ బాక్సర్ మహమ్మద్ హుసాముద్దీన్(57కి) చోటు దక్కలేదు. వీరి స్థానాల్లో సచిన్ సివాచ్(57కి), అభినాశ్ జమ్వాల్ (63.5కి), నిశాంత్దేవ్(71కి), అభిమన్యు(80కి), నరేందర్ బెర్వాల్(92కి), అంక్షిత(60కి), అరుంధతి(66కి) అవకాశం కల్పించారు.