తైపీ : మంగళవారంనుంచి ఆరంభం కానున్న తైపీ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీలో హెచ్ఎస్ ప్రణయ్పైనే భారత్ ఆశలన్నీ. ప్రపంచ తొమ్మిదో ర్యాంకర్ ప్రణయ్ ఇక్కడ మూడో సీడ్గా బరిలోకి దిగనున్నాడు. తొలి రౌండ్లో ప్రణయ్ క్వాలిఫయర్తో తలపడనున్నాడు. గత నెలలో మలేసియా మాస్టర్స్ సూపర్300 టోర్నీ టైటిల్ గెలిచిన ప్రణయ్ గత వారం జరిగిన ఇండోనేసియా ఓపెన్ సూపర్1000 టోర్నీలో సెమీఫైనల్కు చేరుకుని అక్కడ ప్రపంచ నంబర్వన్ చేతిలో ఓడిపోయాడు.
ఈసారి తైపీ ఓపెన్లో టైటిల్పై గురిపెట్టాడు. మహిళల విభాగంలో సైనా నెహ్వాల్, మాళవిక బన్సాద్, ఆకర్షి కశ్యప్, రుత్విక శివాని బరిలో ఉన్నారు. ఇండోనేసియా ఓపెన్ టైటిల్ గెలిచిన భారత పురుషుల జోడి సాత్విక్-చిరాగ్ ఈ టోర్నీలో పాల్గొనడం లేదు. వారి స్థానంలో కృష్ణ ప్రసాద్-విష్ణువర్ధన్, మహిళల డబుల్స్లో రుతుపర్ణ పాండా-శ్వేతపర్ణ పాండా, మిక్స్డ్ డబుల్స్లో రోహన్ కపూర్-సిక్కిరెడ్డి పోటీపడనున్నారు.