హైదరాబాద్, మార్చి 1 (నమస్తే తెలంగాణ): ఆల్ఇండియా పబ్లిక్ బస్ ట్రాన్స్పోర్ట్ కబడ్డీ టోర్నమెంట్-2023 గురువారం నుంచి ప్రారంభం కానున్నది. కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ అయిన ‘అసోసియేషన్ ఆఫ్ స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ అండర్ టేకింగ్స్ (ఏఎస్ఆర్టీయూ) ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ టోర్నమెంట్కు తెలంగాణ రాష్ట్ర రోడ్డురవాణా సంస్థ(టీఎస్ఆర్టీసీ) ఆతిథ్యం ఇస్తున్నది. హైదరాబాద్ శివారు హకీంపేటలోని ట్రాన్స్పోర్ట్ అకాడమీలో మూడు రోజుల పాటు కబడ్డీ టోర్నమెంట్ జరుగనున్నది.
పోటీలను ఏపీఎస్ఆర్టీసీ ఎండీ ద్వారక తిరుమలరావు ప్రారంభిస్తారు. ఈ పోటీల్లో తెలంగాణ, ఏపీ, గుజరాత్, మహారాష్ట్ర, హర్యానా ఆర్టీసీలతో పాటు నవీ ముంబై, బృహణ్ ముంబై, పుణె మహానగర్ పరివహన్, బెంగళూరు మెట్రోపాలిటన్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్లు పాల్గొంటాయి. కబడ్డీ ట్రోఫీ కోసం మొత్తంగా 9 జట్లు తలపడనున్నాయి. ఆర్టీసీ ఉద్యోగులకు మానసిక ఉల్లాసంతో పాటు చకటి ఆరోగ్యం లభించేందుకు ఏఎస్ఆర్టీయూ ఈ టోర్నీ నిర్వహిస్తున్నదని టీఎస్ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్, ఎండీ సజ్జనార్ తెలిపారు.