హైదరాబాద్, ఆట ప్రతినిధి: ఆలిండియా సబ్జూనియర్ అండర్-13 బ్యాడ్మింటన్ టోర్నీలో హంసిని చదరం, అవని విక్రమ్(డబుల్స్) విజేతలుగా నిలిచారు. మంగళవారం జరిగిన బాలికల సింగిల్స్ ఫైనల్లో హంసిని 21-16, 22-20తో అవని విక్రమపై గెలిచి టైటిల్ సొంతం చేసుకుంది. బాలుర తుది పోరులో ఆదిత్య 19-21, 21-16, 21-10తో తన్మయ్ వర్మపై గెలిచాడు. బాలుర డబుల్స్లో దుర్గ ఉదయ్, శ్రీచేతన్ జోడీ 17-21, 21-12, 22-20తో మయూరేశ్, విశ్వజిత్ ద్వయంపై గెలిచింది.
బాలికల డబుల్స్లో అవని, లక్ష్మిసాయి జోడీ టైటిల్ దక్కించుకుంది. విజేతలకు బ్యాడ్మింటన్ చీఫ్ కోచ్ పుల్లెల గోపీచంద్ ట్రోఫీలు అందజేశారు. పోటీల ముగింపు కార్యక్రమానికి హెచ్సీఏ అధ్యక్షుడు జగన్మోహన్రావు, ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ మెంబర్ చాముండేశ్వరీనాథ్, స్టార్ షట్లర్ ప్రణయ్, రంగారెడ్డి బ్యాడ్మింటన్ సంఘం ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్రావు, యూవీఎన్ బాబు తదితరులు పాల్గొన్నారు.