ఓవల్: అజింక్య రహానే టెస్టులో 5 వేల పరుగులు మైలురాయిని దాటేశాడు. ఆస్ట్రేలియాతో జరుగుతున్న డబ్ల్యూటీసీ ఫైనల్ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్లో ఆ మైలురాయిని రహానే అందుకున్నాడు. 82 టెస్టులు ఆడిన రహానే ఖాతాలో 12 సెంచరీలు, 25 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. 83వ టెస్టు ఆడుతున్న రహానే.. టెస్టుల్లో 5 వేల రన్స్ చేసిన 13వ బ్యాటర్గా నిలిచాడు.
5000 Test runs and going strong 💪💪
Keep going, @ajinkyarahane88 #TeamIndia pic.twitter.com/VixAtmYrRK
— BCCI (@BCCI) June 9, 2023
ఇవాళ 92 బంతుల్లోనే హాఫ్ సెంచరీ నమోదు చేసిన రహానే.. ఆ తర్వాత తన దూకుడు పెంచాడు. భారత్ను ఫాలోఆన్ గండం నుంచి గట్టెక్కించే ప్రయత్నం చేస్తున్నాడు. శార్దూల్ ఠాకూర్, రహానే మధ్య ఏడో వికెట్ భారీ భాగస్వామ్యం ఏర్పడింది. ఇప్పటికే ఆ ఇద్దరు 82 రన్స్ జోడించారు.
The 13th Indian to get to 5000 Test runs 💪#WTC23 | #AUSvIND pic.twitter.com/J8xz0tlsPd
— ICC (@ICC) June 9, 2023
ఆసీస్ తొలి ఇన్నింగ్స్లో 469 రన్స్ చేసింది. అయితే భారత్ తన తొలి ఇన్నింగ్స్లో ఇప్పటి వరకు 56 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 235 రన్స్ చేసింది. రహానే 72, శార్దూల్ 32 రన్స్తో క్రీజ్లో ఉన్నారు.