న్యూఢిల్లీ: వచ్చే ఏడాది జరుగనున్న డేవిస్ కప్ వరల్డ్ గ్రూప్-1 ప్లేఆఫ్ పోరు కోసం శనివారం ఆల్ఇండియా టెన్నిస్ సమాఖ్య (ఐటా) భారత జట్టును ప్రకటించింది. ఫిబ్రవరి 3, 4న డెన్మార్క్తో జరుగనున్న పోరు కోసం ఐదుగురితో కూడిన జట్టును ఎంపిక చేసింది.
శశికుమార్ ముకుంద్, ప్రజ్నేశ్ గుణేశ్వరన్, రామ్కుమార్ రామనాథన్, రోహన్ బోపన్న, యూకీ బాంబ్రీ టీమ్లో చోటు దక్కించుకోగా.. రోహిత్ రాంపాల్ నాన్ ప్లేయింగ్ కెప్టెన్గా వ్యవహరించనున్నాడు.