హైదరాబాద్: ప్రైమ్ వాలీబాల్ లీగ్ (పీవీఎల్)లో అహ్మదాబాద్ డిఫెండర్స్ సెమీస్కు అర్హత సాధించింది. శనివారం జరిగిన మ్యాచ్లో అహ్మదాబాద్ 3-2 (7-15, 15-10, 15-13, 15-14, 10-15)తో కోల్కతా థండర్ బోల్ట్స్పై నెగ్గి పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి దూసుకెళ్లింది. తొలి సెట్లో వెనుకబడిన అహ్మదాబాద్.. తర్వాత వరుసగా మూడు సెట్లలో విజృంభించింది. నామమాత్రపు ఆఖరి సెట్ను కోల్పోయిన అహ్మదాబాద్ నాలుగో విజయాన్ని నమోదు చేసుకుంది. 8 పాయింట్లతో సెమీస్ బెర్త్ను ఖాయం చేసుకుంది. షాన్ టీ జాన్ ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కించుకున్నాడు. ఆదివారం చెన్నె బ్లిట్జ్తో బెంగళూరు తలపడనుంది.