INDvsAFG 1st T20I: దేవుడు వరమిచ్చినా పూజారి కరుణించలేదన్నట్టుగా అయింది టీమిండియా ఫ్యాన్స్ పరిస్థితి. 14 నెలల తర్వాత టీ20 జట్టులోకి రీఎంట్రీ ఇచ్చిన స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ.. మొహాలీ (పంజాబ్) వేదికగా గురువారం అఫ్గానిస్తాన్తో జరుగబోయే తొలి మ్యాచ్కు దూరమయ్యాడు. ఈ విషయాన్ని స్వయంగా భారత జట్టు హెడ్కోచ్ రాహుల్ ద్రావిడే వెల్లడించాడు. తొలి మ్యాచ్కు ముందు పాత్రికేయులతో నిర్వహించిన ప్రీమ్యాచ్ ప్రెస్ కాన్ఫరెన్స్లో మాట్లాడుతూ ద్రావిడ్ ఈ విషయాన్ని చెప్పాడు. వ్యక్తిగత కారణాలతోనే కోహ్లీ ఈ మ్యాచ్కు దూరమవుతున్నాడని, అయితే అతడు ఇండోర్తో ఈనెల 14న జరుగబోయే మ్యాచ్కు మాత్రం అందుబాటులో ఉంటాడని ద్రావిడ్ తెలిపాడు.
ఓపెనర్లుగా ఆ ఇద్దరే..
అఫ్గాన్తో సిరీస్కు రీఎంట్రీ ఇచ్చిన కోహ్లీతో పాటు రోహిత్ శర్మలు ఇన్నింగ్స్ను ఓపెన్ చేస్తారని కూడా చర్చ జరిగింది. కానీ కోహ్లీ తొలి మ్యాచ్కు దూరమైన నేపథ్యంలో రైట్ హ్యాండ్, లెఫ్ట్ హ్యాండ్ కాంబినేషన్ వైపే టీమ్ మేనేజ్మెంట్ మొగ్గుచూపింది. దీని ప్రకారం.. రోహిత్ శర్మ – యశస్వి జైస్వాల్లు భారత ఇన్నింగ్స్ను ఆరంభించనున్నారు. ద్రావిడ్ కూడా ఈ విషయాన్ని స్పష్టం చేశాడు.
Rahul Dravid said “Media reports are not true – Ishan Kishan asked for the rest, he hasn’t made himself available and Shreyas Iyer missed out due to lots of batters in the mix – no disciplinary actions, these are fake”. [JioCinema] pic.twitter.com/pnj5htt2Wo
— Johns. (@CricCrazyJohns) January 10, 2024
వాళ్లిద్దరి మీద క్రమశిక్షణ చర్యలేమీ లేవు..
టీమిండియా యువ వికెట్ కీపర్ ఇషాన్ కిషన్తో పాటు మిడిలార్డర్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్లపై బీసీసీఐ క్రమశిక్షణా చర్యలకు దిగిందని, అందుకే ఈ ఇద్దరినీ అఫ్గాన్తో సిరీస్లో ఎంపిక చేయలేదని వస్తున్న వార్తలపైనా ద్రావిడ్ స్పందించాడు. అలాంటిదేమీ లేదని, ఆ ఇద్దరూ తమకు విశ్రాంతి కావాలని అడిగితేనే వారిపేర్లను పరిగణనలోకి తీసుకోలేదని, దేశవాళీలో ఆడనున్న ఈ ఇద్దరూ త్వరలోనే జాతీయ జట్టులోకి వస్తారని ద్రావిడ్ ఆశాభావం వ్యక్తం చేశాడు.