INDvsENG: ఇంగ్లండ్తో మరో వారం రోజులలో మొదలుకాబోతున్న తొలి టెస్టుకు ముందు ఆంధ్రా వికెట్ కీపర్ బ్యాటర్ కోన శ్రీకర్ భరత్ తన స్థానాన్ని మరింత పదిలం చేసుకున్నాడు. రెండో ఇన్నింగ్స్లో అతడు.. సెంచరీతో చెలరేగడంతో భారత్ ‘ఎ’ జట్టు.. ఇంగ్లండ్ లయన్స్తో ముగిసిన మ్యాచ్ను డ్రా చేసుకున్నది. ఇంగ్లండ్తో సిరీస్కు ఇదివరకే ప్రకటించిన తొలి రెండు టెస్టుల సిరీస్లో భరత్తో పాటు ధ్రువ్ జురెల్ కూడా స్పెషలిస్టు వికెట్ కీపర్ కోటాలో చోటు దక్కించుకోగా మరో వికెట్ కీపర్ బ్యాటర్ కెఎల్ రాహుల్ సైతం జట్టులో ఉన్నాడు. పోటీ తీవ్రంగా ఉన్న నేపథ్యంలో భరత్.. సెంచరీ సాధించడం అతడి స్థానాన్ని మరింత ధృడం చేసింది.
ఇండియా ఎ – ఇంగ్లండ్ లయన్స్ మధ్య అహ్మదాబాద్ వేదికగా ముగిసిన మ్యాచ్లో తొలి ఇన్నింగ్స్లో ఇంగ్లండ్.. 118 ఓవర్లలో 553 పరుగులు చేసింది. బదులుగా ఇండియా ఎ.. 47 ఓవర్లలో 227 పరుగులకే ఆలౌట్ అయింది. రజత్ పాటిదార్ సెంచరీ (151) ఒక్కడే రాణించాడు. ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్లో 6 వికెట్ల నష్టానికి 163 పరుగులు చేసింది. భారత్ సెకండ్ ఇన్నింగ్స్లో 125 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి 426 పరుగులు చేసింది. భారత్ తరఫున సాయి సుదర్శన్ (97), సర్ఫరాజ్ ఖాన్ (55), మానవ్ సుతర్ (89)లతో పాటు శ్రీకర్ భరత్ సెంచరీ చేయడంతో భారత్ మ్యాచ్ను డ్రా చేసుకోగలిగింది.
KS Bharat vs Eng Lions Today
115(164)*,15 x 4’s helped India A to draw the game.
His Good form with the Bat continues. pic.twitter.com/5rubFZLZJW— Knight Vibe (@KKRiderx) January 20, 2024