ఒక్కటంటే ఒక్కటే మ్యాచ్ టీమిండియా మిడిలార్డర్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ ను తన కెరీర్ లోనే ఉత్తమ ర్యాంకుకు చేరిస్తే అదే ఒక్క ప్రదర్శన జస్ప్రీత్ బుమ్రాను అగ్రపీఠం మీద కూర్చోబెట్టింది. ఐసీసీ తాజాగా విడుదల చేసిన వన్డే, టీ20 ర్యాంకింగ్స్ లో ఈ ఇద్దరూ సత్తా చాటారు.
ఇంగ్లండ్ తో మంగళవారం ముగిసిన మొదటి వన్డేలో తన కెరీర్ లోనే అత్యుత్తమ గణాంకాలు నమోదు చేశాడు బుమ్రా. ఈ మ్యాచ్ లో అతడు.. 7.2 ఓవర్లు వేసి 19 పరుగులిచ్చి 6 వికెట్లు తీసుకున్నాడు. దీంతో అతడు ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్ లో బౌలర్ల జాబితాలో అగ్రస్థానానికి చేరాడు. ట్రెంట్ బౌల్డ్ (712 రేటింగ్ పాయింట్లు) ను వెనక్కి నెట్టి బుమ్రా (718 రేటింగ్ పాయింట్లు) అగ్రస్థానాన్ని ఆక్రమించాడు. ఈ జాబితాలో పాకిస్తాన్ పేసర్ షాహిన్ అఫ్రిది .. 681 పాయింట్లతో మూడో స్థానంలో ఉన్నాడు.
ఇక టీ20లలో టీమిండియా మిడిలార్డర్ సూర్యకుమార్ యాదవ్.. ఏకంగా 44 స్థానాలు పైకి ఎగబాకాడు. ఐసీసీ టీ20 జాబితాలో టాప్-10 కు ఎంట్రీ ఇచ్చాడు. ప్రస్తుతం సూర్య టీ20 ర్యాంకింగ్స్ లో ఐదో స్థానంలో నిలిచాడు . ఈ జాబితాలో బాబర్ ఆజమ్, మహ్మద్ రిజ్వాన్ (పాకిస్తాన్), మార్క్రమ్ (దక్షిణాఫ్రికా), డేవిడ్ మలన్(ఇంగ్లండ్) లు తొలి నాలుగు స్థానాల్లో ఉన్నారు.
ఇంగ్లండ్ తో ఇటీవలే ముగిసిన టీ20సిరీస్ లోని చివరి మ్యాచ్ లో సూర్య.. 117 పరుగులు చేశాడు. తద్వారా తన ర్యాంకును కూడా మెరుగుపర్చుకున్నాడు. టాప్-10లో సూర్య తప్ప మరే భారత బ్యాటర్ కూడా ఈ జాబితాలో లేడు. ఇషాన్ కిషన్ 12వ ర్యాంకులో కొనసాగుతున్నాడు.
No bowler above him 🔝
Jasprit Bumrah stands as the No.1 ODI bowler in the latest @MRFWorldwide rankings!
— ICC (@ICC) July 13, 2022