హంబన్టోటా: టాప్-10 క్రికెట్ జట్టుపై అత్యధిక పరుగులు చేజ్ చేసిన జట్టుగా ఆఫ్ఘనిస్థాన్ రికార్డు సృష్టించింది. మూడు వన్డేల సిరీస్ ఆడేందుకు శ్రీలంక జట్టు ఆఫ్ఘనిస్థాన్ టూర్కు వెళ్లింది. టోర్నీలో భాగంగా ఇవాళ రెండు జట్ల మధ్య తొలి వన్డే మ్యాచ్ జరిగింది. తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక జట్టు 268 పరుగులకు ఆలౌట్ అయ్యింది.
అనంతరం బ్యాటింగ్కు దిగిన ఆప్ఘనిస్థాన్ టీమ్ ఆది నుంచి అదరగొట్టింది. ఓపెనర్ ఇబ్రహీం జర్డాన్ (98), వన్ డౌన్లో వచ్చిన రహమత్ షా (55) అద్భుత ఆట తీరుతో ఆప్ఘనిస్థాన్ జట్టు 46.5 ఓవర్లలో కేవలం 4 వికెట్లు కోల్పోయి 269 పరుగులు చేసి విజయాన్ని ముద్దాడింది. టాప్-10లో ఉన్న క్రికెట్ జట్టుపై ఆప్ఘనిస్థాన్ జట్టు ఇంత భారీ లక్ష్యాన్ని చేదించడం ఇదే తొలిసారి.
ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్లో ప్రస్తుతం ఆప్ఘనిస్థాన్ జట్టు 8వ స్థానంలో ఉండగా, శ్రీలంక జట్టు 9వ స్థానంలో కొనసాగుతున్నది. కాగా సిరీస్లో భాగంగా రెండు జట్ల మధ్య రెండో వన్డే ఆదివారం జరుగనుంది.