న్యూఢిల్లీ: అఫ్ఘానిస్థాన్పై (Afghanistan) పాకిస్థాన్ మరోసారి వైమానిక దాడులకు పాల్పడింది. డ్యూరాండ్ రేఖ వెంబడి పాక్, అఫ్ఘాన్ సరిహద్దుల్లో ఉన్న పాక్టికా ప్రావిన్స్లో దాడులకు పాల్పడింది. దీంతో పది మంది మరణించారు. మృతుల్లో ముగ్గురు దేశవాళీ క్రికెటర్లు కూడా ఉన్నారని అఫ్ఘానిస్థాన్ క్రికెట్ బోర్డు (ACB) ప్రకటించింది. పాక్ దాడులకు నిరసనగా వచ్చే నెలలో పాకిస్థాన్, శ్రీలంక జట్లతో తలబడబోయే ముక్కోణపు సిరీస్ నుంచి తప్పుకుంటున్నట్లు ఏసీబీ వెల్లడించింది. మృతులకు సోషల్ మీడియా వేదికగా సంతాపం తెలుపుతూ పోస్టు చేసింది.
పాక్ వైమానిక దాడిలో పాక్టికా ప్రావిన్స్లోని ఉర్గున్ జిల్లాకు చెందిన క్రికెటర్లు ప్రాణాలు కోల్పోయారు. పాక్ ప్రభుత్వం ఆధ్వర్యంలో జరిగిన ఈ దాడిలో అఫ్ఘాన్ పౌరులు మృతిచెందారు. దీనిపై ఏసీబీ తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నది. ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోగా, అందులో ముగ్గురు క్రికెటర్లు ఉన్నారు. ఫ్రెండ్లీ మ్యాచ్ ఆడేందుకు పాక్టికా ప్రావిన్స్ రాజధాని శరణకు వెళ్లిన ముగ్గురు క్రికెటర్లు కబీర్ అఘా, సిబ్గుతుల్లా, హరూర్ తిరిగి ఉర్గున్ వస్తుండగా ఈ దాడి జరిగింది. వారి మరణం అఫ్ఘాన్ అథ్లెట్, క్రికెటింగ్ కుటుంబానికి తీరని లోటుగా భావిస్తున్నాం. మృతుల కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాం. ఈ దాడికి నిరసనగా వచ్చే నెలలో జరుగనున్న ముక్కోణపు టీ20 సిరీస్ నుంచి వైదొలగాలని నిర్ణయించాం. ఇందులో పాకిస్థాన్ కూడా ఉండటంతోనే సిరీస్ నుంచి తప్పుకుంటుంన్నాం. గాయపడిన పౌరులు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నామని పేర్కొంటూ ఏసీబీ ట్వీట్ చేసింది.
Statement of Condolence
The Afghanistan Cricket Board expresses its deepest sorrow and grief over the tragic martyrdom of the brave cricketers from Urgun District in Paktika Province, who were targeted this evening in a cowardly attack carried out by the Pakistani regime.
In… pic.twitter.com/YkenImtuVR
— Afghanistan Cricket Board (@ACBofficials) October 17, 2025