షార్జా: పొట్టి సిరీస్లో పాకిస్థాన్కు అఫ్గానిస్థాన్ గట్టి షాక్ ఇచ్చింది. మూడు మ్యాచ్ల సిరీస్లో భాగంగా శుక్రవారం రాత్రి జరిగిన తొలి టీ20లో అఫ్గాన్ 6 వికెట్ల తేడాతో పాకిస్థాన్ను చిత్తుచేసింది. అంతర్జాతీయ మ్యాచ్లో పాక్పై అఫ్గానిస్థాన్కు ఇదే తొలి గెలుపు. మొదట బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 92 పరుగులు చేసింది. స్టార్ ఆటగాళ్లు బాబర్ ఆజమ్, మహమ్మద్ రిజ్వాన్ ఈ సిరీస్ నుంచి విశ్రాంతి తీసుకోగా.. ఇమాద్ వసీమ్ (18) టాప్ స్కోరర్గా నిలిచాడు. అఫ్గాన్ బౌలర్లలో నబి, ముజీబ్, ఫజల్ తలా రెండు వికెట్లు పడగొట్టారు. అనంతరం లక్ష్యఛేదనలో అఫ్గాన్ 17.5 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 98 రన్స్ చేసింది. నబి (38 నాటౌట్) రాణించాడు.