బాంకాక్ : ఆసియా కప్ అండర్-17 ఫుట్బాల్ చాంపియన్షిప్లో శుక్రవారం భారత జట్టు బలీయమైన జపాన్తో తలపడనున్నది. గ్రూపు-డిలో తలపడుతున్న భారత్కు తుది ఎనిమిది జట్లలో చోటు దక్కించుకోవడం కష్టమే. అయితే ప్రణాళికలను పక్కాగా అమలుపరిస్తే అదేమంత అసాధ్యం కాబోదని హెడ్ కోచ్ బిబియానొ ఫెర్నాండెజ్ అన్నాడు.
నేటి మ్యాచ్లో భారత జట్ట జపాన్పై గెలవడంతోపాటు, ఉజ్బెకిస్థాన్ వియత్నాంతో మ్యాచ్ను కనీసం డ్రాగా ముగించాలి. భారత జట్టు ఇప్పటివరకు వియత్నాంతో మ్యాచ్ను 1-1గా డ్రా చేసుకుని, ఉజ్బెకిస్థాన్ చేతిలో 0-1తో ఓడిపోయింది.