Abhinav Bindra : ఒలింపిక్స్లో బంగారు పతకంతో చరిత్ర సృష్టించిన షూటర్ అభినవ్ బింద్రా(Abhinav Bindra)కు అరుదైన గౌరవం దక్కింది. ఈ ఏడాది ప్యారిస్ విశ్వక్రీడ(Paris Olympics 2024)ల్లో బింద్రా భారత టార్చ్ బేరర్గా ఎంపికయ్యాడు. ప్రస్తుతం అథ్లెట్స్ కమిషన్ ఆఫ్ ది ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ(ACOITC) సభ్యుడిగా ఉన్న బింద్రా ఒలింపిక్ జ్యోతిని వెలిగించనున్నాడు. ఈ గౌరవం దక్కడంతో ఈ మాజీ షూటర్ పట్టలేనంత సంతోషంలో ఉన్నాడు.
పారిస్ ఒలింపిక్స్లో టార్చ్ బేరర్గా ఎంపికైనందుకు చాలా హ్యాపీగా ఉంది. ఒలింపిక్ జ్యోతి శాంతి, పట్టుదలకు ప్రతీక. ఈ కాగడ మనందరి ఐక్యతను, కలలకు ప్రతిరూపం. ఈ గౌరవం నిజంగా చాలా గొప్పది అని బింద్రా తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ పెట్టాడు.
Excited to share that I’ll be a torch bearer for the @paris2024 Olympic Games , a beacon of peace and perseverance across the globe. This flame represents our collective spirit and the power of dreams. A great privilege and honour! #OlympicTorch #Paris2024 #wecarrytheflame 🔥 pic.twitter.com/kizpgHXlzP
— Abhinav A. Bindra OLY (@Abhinav_Bindra) February 1, 2024
ఒలింపిక్ జ్యోతిని గ్రీస్లోని ఒలింపియాలో మొదట వెలిగిస్తారు. ఆ తర్వాత ఆ దేశంలో ప్రదర్శన ముగిశాక ఆ జ్యోతిని సముద్ర మార్గం గుండా పెద్ద ఓడలో ఫ్రాన్స్కు తరలిస్తారు.ఏప్రిల్ 16 నుంచి జూలై 26 వరకు ఒలింపిక్ టార్చ్ రీలే జరుగనుంది. ఈ రీలేలో బింద్రా ఒలింపిక్ కాగడను వెలిగించనున్నాడు. 68 రోజుల పాటు జరిగే ఈ రీలే వివిధ దేశాలకు చెందిన 10 వేల మంది అథ్లెట్లు పాల్గొననున్నారు.
అభినవ్ బింద్రా