ముంబై: ఐపీఎల్లో కోల్కతా నైట్రైడర్స్తో మ్యాచ్లో ఇరగదీసిన ఏబీ డివిలియర్స్ తాను రిటైర్మెంట్ నుంచి బయటకు రావడానికి సిద్ధంగా ఉన్నట్లు మరోసారి ప్రకటించాడు. నేషనల్ టీమ్లో చోటు దక్కితే తాను తప్పకుండా ఆ పని చేస్తానని చెప్పాడు. అంతేకాదు సౌతాఫ్రికా టీమ్ చీఫ్ కోచ్ మార్క్ బౌచర్తో తాను ఈ విషయంపై మాట్లాడతాననీ ఏబీడీ చెప్పడం విశేషం. నైట్రైడర్స్పై ఆకాశమే హద్దుగా చెలరేగిన డివిలియర్స్ 34 బంతుల్లోనే 76 పరుగులు చేసిన విషయం తెలిసిందే.
మ్యాచ్ తర్వాత అతడు మీడియాతో మాట్లాడాడు. ఐపీఎల్ సీజన్ ముగిసిన తర్వాత తన ఫామ్, ఫిట్నెస్పై అంచనా వేసుకని బౌచర్తో మాట్లాడతానని ఈ సందర్భంగా డివిలియర్స్ చెప్పాడు. ఈ ఏడాది చివర్లో జరగబోయే టీ20 వరల్డ్కప్ కోసం ఏబీడీని టీమ్లోకి తీసుకోవడంపై అటు సౌతాఫ్రికా టీమ్ మేనేజ్మెంట్ కూడా సానుకూలంగానే స్పందించడం విశేషం.
ఐపీఎల్ ప్రారంభానికి ముందే తాను డివిలియర్స్తో మాట్లాడినట్లు బౌచర్ చెప్పాడు. 2018లో ఊహించని రీతిలో ఏబీడీ రిటైర్మెంట్ ప్రకటించాడు. అయితే 2019 వన్డే వరల్డ్కప్ టీమ్లోకి మళ్లీ రావాలని అతడు భావించాడు. ఇదే విషయాన్ని అప్పటి టీమ్ కెప్టెన్ డుప్లెస్సికి చెప్పినా అప్పటికే ఆలస్యమైందని టీమ్ మేనేజ్మెంట్ నో చెప్పింది. ఇప్పుడు కూడా తనకు టీమ్లో చోటు దక్కకపోతే ఏమీ చేయలేనని అతడు అన్నాడు.
ఒకవేళ చోటు దక్కితే మాత్రం చాలా సంతోషమని, ఐపీఎల్ ముగిసే లోపు దీనిపై బౌచర్ నుంచి స్పష్టమైన సమాధానం కోసం ఎదురు చూస్తున్నట్లు అతడు చెప్పాడు. ఇంటర్నేషనల్ క్రికెట్ ఆడే సత్తా ఉన్నా కూడా అనుకోని రీతిలో రిటైర్మెంట్ ప్రకటించిన డివిలియర్స్.. ఐపీఎల్లాంటి లీగ్లలో మాత్రం సత్తా చాటుతూనే ఉన్నాడు.
షాకింగ్.. కనీసం సగం మంది కరోనా యోధులకూ అందని వ్యాక్సిన్
కరోనా బారిన పడి కోలుకున్న వారికి ఒక్క డోసు వ్యాక్సిన్ చాలు!
ముత్తయ్య మురళీధరన్కు యాంజియోప్లాస్టీ
భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్లు..!
దేశంలో కరోనా కరాళ నృత్యం.. 24 గంటల్లో భారీగా కొత్త కేసులు
రాష్ట్రంలో కొత్తగా 4009 కరోనా కేసులు
భక్తులకు టీటీడీ కీలక సూచనలు