హైదరాబాద్, ఆట ప్రతినిధి: జాతీయ పారా అథ్లెటిక్స్ చాంపియన్షిప్లో తెలంగాణకు చెందిన యువ అథ్లెట్ జివాంజి దీప్తి పసిడి పతకంతో మెరిసింది.
పుణే వేదికగా జరిగిన టోర్నీ మహిళల 400 మీటర్ల విభాగంలో దీప్తి స్వర్ణం కైవసం చేసుకుంది. టీ20 కేటగిరీలో బరిలోకి దిగిన దీప్తి.. మెరుపు వేగంతో లక్ష్యాన్ని చేరి అగ్రస్థానంలో నిలిచింది.