హైదరాబాద్: అభిమానానికి హద్దులు ఉండవంటారు. అవును ఇది మరోమారు నిరూపితమైంది. తాను ఎంతగానో అభిమానించే విరాట్ కోహ్లీ ఆట చూసేందుకు వీరాభిమాని సహసం చేశాడు. ఒర్లాండో(కాలిఫోర్నియా) నుంచి రికార్డు స్థాయిలో 8985 మైళ్ల దూరం ప్రయాణం చేసి హైదరాబాద్ చేరుకున్నాడు.
గురువారం సన్రైజర్స్ హైదరాబాద్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య జరిగిన మ్యాచ్ను ప్రత్యక్షంగా వీక్షించేందుకు వచ్చిన సదరు అభిమాని ప్లకార్డును ప్రదర్శించడం ద్వారా ఇది వెలుగులోకి వచ్చింది. ‘ఒర్లాండో టు హైదరాబాద్. నీ(కోహ్లీ) ఆట చూసేందుకు 8985 మైళ్ల దూరం ప్రయాణించి హైదరాబాద్కు వచ్చానంటూ’ ప్లకార్డుపై రాసుకొచ్చాడు. అభిమానులను ఏ మాత్రం నిరాశపర్చని ఆర్సీబీ స్టార్ బ్యాటర్ కోహ్లీ శతక గర్జనతో జట్టుకు అద్భుత విజయాన్నందించాడు.