పంచకుల: ప్రతిష్ఠాత్మక ఖేలోఇండియా యూత్ గేమ్స్లో మొత్తం 4700 మంది అథ్లెట్లు పోటీపడుతున్నారు. ఇందులో 2,262 మంది బాలికలు ఉన్నారు. శనివారం నుంచి మొదలవుతున్న యూత్గేమ్స్ కోసం ఏర్పాట్లన్నీ ఇప్పటికే పూర్తయ్యాయి. అంబాల, షాహాబాద్, చండీగఢ్, న్యూఢిల్లీ వేదికలుగా మొత్తం 25 క్రీడా విభాగాల్లో ప్లేయర్లు పోటీపడుతున్నారు. కొత్తగా నిర్మించిన మల్టిపర్పస్ హాల్స్లో యూత్ గేమ్స్ ఏర్పాట్లు పూర్తి చేశారు. గతానికి భిన్నంగా ఈసారి 36 రాష్ర్టాలతోపాటు కేంద్ర పాలిత ప్రాంతాల నుంచి ప్లేయర్లు గేమ్స్లో పాలుపంచుకుంటున్నారు. ఆతిథ్య హర్యానా నుంచి 398 మంది అథ్లెట్లతో మహారాష్ట్ర(357), ఢిల్లీ(339) ఆ తర్వాత స్థానాల్లో ఉన్నాయి.