TeamIndia | ముంబై: సుదీర్ఘ భారత క్రికెట్లో అరుదైన సందర్భం చోటు చేసుకుంది. టీమ్ఇండియా అన్ని ఫార్మాట్లలో నంబర్వన్ జట్టుగా నిలిచింది.
ఇప్పటికే టీ20, టెస్టు ఫార్మాట్లలో టాప్ ర్యాంక్లో కొనసాగుతున్న రోహిత్సేన..తాజాగా వన్డేల్లో అగ్రస్థానాన్ని దక్కించుకుంది. మొహాలీలో ఆస్ట్రేలియాతో తొలి వన్డేలో ఘన విజయం సాధించడం ద్వారా దాయాది పాకిస్థాన్(115)ను దాటేస్తూ భారత్(116) నంబర్వన్గా నిలిచింది.