మాలె: దక్షిణాసియా ఫుట్బాల్ సమాఖ్య (సాఫ్) చాంపియన్షిప్లో సునీల్ ఛెత్రీ నాయకత్వంలోని భారత జట్టు మరో కీలక పోరుకు సిద్ధమైంది. బుధవారం ఆఖరి లీగ్ మ్యాచ్లో మాల్దీవులుతో భారత్ తలపడనుంది. తొలి రెండు మ్యాచ్లను ‘డ్రా’ చేసుకున్న ఛేత్రీ సన.. మూడో పోరులో నేపాల్పై నెగ్గి ఐదు పాయింట్లతో పట్టికలో మూడో స్థానంలో ఉంది. ఈ మ్యాచ్లో విజయం సాధిస్తేనే భారత్ తుదిపోరుకు అర్హత సాధిస్తుంది. సాఫ్ చాంపియన్షిప్లో మెరుగైన రికార్డు ఉన్న మన జట్టు ఇప్పటి వరకు ఏడుసార్లు టైటిల్ నెగ్గింది.. గత 11 సీజన్లలో భారత్ ప్రతిసారీ ఫైనల్కు చేరడం విశేషం. గత మ్యాచ్లో ఆఖరి నిమిషాల్లో కెప్టెన్ ఛెత్రీ ఏకైక గోల్ చేయడంతో నేపాల్పై నెగ్గిన భారత్.. మరోసారి అతడిపైనే ఆశలు పెట్టుకుంది.