ICC New Regulations: పరిమిత ఓవర్ల క్రికెట్ను మరింత రంజుగా మార్చడంతో పాటు వృథా సమయాన్ని అరికట్టేందుకు గాను అంతర్జాతీయ క్రికెట్ నియంత్రణ మండలి (ఐసీసీ) కొత్త నిబంధనలను తీసుకురానుంది. వన్డేలు, టీ20లలో రెండు ఓవర్ల మధ్య గ్యాప్ను తగ్గించడంతో పాటు ఒకవేళ బౌలింగ్ జట్టు అదే తప్పును మూడు సార్లు రిపీట్ చేస్తే ప్రత్యర్థి జట్టుకు ఐదు పరుగుల పెనాల్టీ రూపంలో వెళ్లే విధంగా మార్పులు చేయనుంది. రాబోయే డిసెంబర్ నుంచే దీనిని ప్రయోగాత్మకంగా అమలుచేయనున్నారు.
అహ్మదాబాద్ వేదికగా ముగిసిన ఐసీసీ బోర్డు మీటింగ్లో ఇందుకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకున్నట్టు ఐసీసీ ఓ ప్రకటనలో పేర్కొంది. దీని ప్రకారం.. వన్డేలు, టీ20లలో బౌలింగ్ చేసే టీమ్ ఒక ఓవర్ పూర్తి చేశాక 60 సెకన్ల (ఒక నిమిష)లో మరో ఓవర్ వేయాలి. ఈ మేరకు కొత్తగా ‘స్టాప్ క్లాక్’ విధానాన్ని కూడా తీసుకురానుంది. ఒకవేళ అలాకాని పక్షంలో మ్యాచ్లో బౌలింగ్ జట్టు ఈ నిబంధనను మూడు సార్లు గనక ఉల్లంఘిస్తే అప్పుడు ప్రత్యర్థి జట్టుకు పెనాల్టీ రూపంలో ఐదు పరుగులు దక్కనున్నాయి.
ICC to introduce a Stop clock on trail basis in Men’s ODI & T20I.
– The clock will be used to regulate the amount of time taken between overs. If the bowling team is not ready to bowl the next over within 60 sec then 5 run penalty will be imposed if it happens for 3rd time. pic.twitter.com/cobKdeTRe7
— Johns. (@CricCrazyJohns) November 21, 2023