నమస్తే తెలంగాణ క్రీడావిభాగం ; పొట్టి క్రికెట్లో సంచలనం నమోదైంది. ఆసియా క్రీడల్లో భాగంగా మంగోలియాతో జరిగిన మ్యాచ్లో నేపాల్ బ్యాటర్లు విధ్వంసం సృష్టించారు. బాదుడే పరమావధిగా బరిలోకి దిగిన నేపాల్ లెక్కకు మిక్కిలి ప్రపంచ రికార్డులు బద్దలు కొట్టింది. గ్రూప్-‘ఎ’లో భాగంగా బుధవారం జరిగిన పోరులో నేపాల్ 273 పరుగుల తేడాతో మంగోలియాను చిత్తుచేసింది. మొదట బ్యాటింగ్ చేసిన నేపాల్ 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 314 పరుగులు చేసింది. అంతర్జాతీయ టీ20లో ఇదే అత్యధిక స్కోరు కాగా.. కుషాల్ మల్ల (50 బంతుల్లో 137 నాటౌట్; 8 ఫోర్లు, 12 సిక్సర్లు) భారీ సెంచరీతో కదంతొక్కాడు. కెప్టెన్ రోహిత్ పడేల్ (27 బంతుల్లో 61; 2 ఫోర్లు, 6 సిక్సర్లు) ఫిఫ్టీ కొట్టగా.. చివర్లో దీపేంద్ర సింగ్ (10 బంతుల్లో 52 నాటౌట్; 8 సిక్సర్లు) ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. ప్రతి బంతిని సిక్సర్ కొట్టడమే లక్ష్యంగా శివతాండవమాడిన దీపేంద్ర పొట్టి ఫార్మాట్లో యువరాజ్ సింగ్ (12 బంతుల్లో, ఇంగ్లండ్పై 2007 టీ20 ప్రపంచకప్) ఫాస్టెస్ట్ ఫిప్టీ రికార్డు బద్దలు కొట్టాడు. ఈ క్రమంలో అతడు ఎదుర్కొన్న తొలి ఆరు బంతులను సిక్సర్లుగా మలచడం గమనార్హం. అనంతరం ఛేదనలో మంగోలియా 13.1 ఓవర్లలో 41 పరుగులకు ఆలౌటైంది.
పొట్టి ఫార్మాట్లో వేగవంతమైన హాఫ్సెంచరీ చేసిన ప్లేయర్గా దీపేంద్ర సింగ్ చరిత్రకెక్కాడు.
యువరాజ్ సింగ్ (12 బంతుల్లో) రెండో స్థానంలో ఉన్నాడు9 బంతుల్లోనే హాఫ్ సెంచరీ