హైదరాబాద్, జనవరి 23 (నమస్తే తెలంగాణ) : గచ్చిబౌలిలోని ఇండోర్ స్టేడియంలో ఫిబ్రవరి 5 నుంచి 27 వరకు ప్రైమ్ వాలీబాల్ లీగ్ జరుగనుంది. ఈ లీగ్ పోస్టర్ను ఆదివారం హైదరాబాద్లోని తన కార్యాలయంలో క్రీడా మంత్రి శ్రీనివాస్గౌడ్ ఆవిష్కరించారు. ఈ లీగ్లో హైదరాబాద్ జట్టుతో పాటు దేశవ్యాప్తంగా మరో 7 నగరాల జట్లు పాల్గొంటాయని నిర్వాహకుడు అభిషేక్రెడ్డి తెలిపారు.