హనుమకొండ చౌరస్తా : హనుమకొండలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో జరుగుతున్ను 34వ సౌత్ జోన్ అథ్లెటిక్స్ చాంపియన్షి రెండో రోజు తెలంగాణ క్రీడాకారులు పతకాలతో మెరిశారు. 4X400 మీటర్ల మిక్స్డ్ రీలేలో మొదటి రెండు స్థాన్లాలో నిలిచిన కేరళ, కర్నాటక, మూడో స్థానంలో నిలిచిన తెలంగాణ అథ్లెట్లకు ద్రోణాచార్య అవార్డు గ్రహీత నాగపూరి రమేశ్, తెలంగాణ అసోసియేషన్ ఆర్గనైజింగ్ సెక్రటరీ పగిడాల వెంకటేశ్వర్ రెడ్డి పతకాలు అందించారు.
బాలుర అండర్ -14ట్రయాథ్లాన్లో వరుణ్ స్వర్ణం, జే దీక్షిత్ రజతం, లాంగ్జంప్లో సోము మాధవి స్వర్ణ పతకాలు గెలిచారు. బాలికల అండర్ -14లో 600 మీటర్లలో ప్రణతి పసిడి, అండర్ -16 హెక్సాథ్లాన్లో బి.వైశాలి బంగారు పతకం, బాలుర అండర్-16లో 400 మీటర్ల పరుగులో అజారుద్దీన్ వెండి పతకం సాధించారు. ఈ టోర్నమెంట్లో వివిధ రాష్ర్టాలకు చెందిన 800 మంది అథ్లెట్లు 140 విభాగాల్లో పోటీపడుతున్నారు.