Srilanka Cricketers : శ్రీలంక క్రికెట్లో పెళ్లి బాజాలు మోగాయి. ఏకంగా ముగ్గురు క్రికెటర్లు ఓకేరోజు పెళ్లి పీటలెక్కారు. కొలంబోలో వేర్వేరు చోట్ల సోమవారం కసున్ రజిత, చరిత్ అసలంక, పథుమ్ నిస్సంకల పెళ్లి జరిగింది. శ్రీలంక క్రికెట్ ఈ ముగ్గురి పెళ్లి ఫొటోలను ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసి, శుభాకాంక్షలు తెలిపింది. విశేషం ఏంటంటే.. వన్డే సిరీస్ మధ్యలోనే వీళ్లు పెళ్లి చేసుకున్నారు. వీళ్లందరూ అఫ్గానిస్థాన్తో మూడు వన్డేల సిరీస్లో ఆడుతున్నారు. రెండో వన్డే తర్వాత ఈ ముగ్గురు వివాహం చేసుకున్నారు.
పథున్ నిస్సంక మొదటి వన్డేలో 85 పరుగులు చేశాడు. అయితే ఈ మ్యాచ్లో శ్రీలంక 60 పరుగుల తేడాతో ఓడిపోయింది. కసున్ రజిత రెండు మ్యాచుల్లో4 వికెట్లు తీశాడు. చరిత్ అసలంక రెండు మ్యాచుల్లో కలిపి 10 పరుగులు మాత్రమే చేశాడు. బుధవారం మూడో వన్డే జరగనుంది. వీళ్లు ఆ రోజు జట్టుతో చేరతారు. మూడు వన్డేల సిరీస్లో అఫ్గానిస్థాన్ 1-0తో ఆధిక్యంలో ఉంది.
Congratulations to Charith Asalanka, Pathum Nissanka and Kasun Rajitha! 💍🎉 pic.twitter.com/qlUZKtOMVG
— Sri Lanka Cricket 🇱🇰 (@OfficialSLC) November 28, 2022