దుబాయ్: ఆసియా యూత్, జూనియర్ బాక్సింగ్ చాంపియన్షిప్లో భారత బాక్సర్ల జోరు కొనసాగుతున్నది. దుబాయ్ వేదికగా జరుగుతున్న ఈ టోర్నీలో మరో ముగ్గురు మహిళా బాక్సర్లు ఫైనల్స్కు దూసుకెళ్లారు. గురువారం జరిగిన బౌట్లలో తను (52 కేజీలు), నికిత చంద్ (60 కేజీలు), విషు రాఠి (48 కేజీలు) విజయాలు సాధించారు. సెమీస్లో తను 5-0తో స్వోస్తిక (నేపాల్)ను చిత్తుచేయగా.. ముఖుస తొకిరోవా (ఉజ్బెకిస్థాన్)పై నికిత గెలిచింది. మరో బౌట్లో మంగోళియా బాక్సర్ ఎసుంఖుస్లిన్పై విషు పైచేయి సాధించింది.