న్యూఢిల్లీ: క్రొయేషియా వేదికగా జరిగే జాగ్రెబ్ ఓపెన్ కోసం అడ్హాక్ కమిటీ 13 మంది రెజ్లర్లను మంగళవారం ప్రకటించింది. అయితే స్టార్ రెజ్లర్లు బజరంగ్ పునియా, అంతిమ్ పంగల్ లేకుండానే భారత్ బరిలోకి దిగబోతున్నది. పురుషుల ఫ్రీ స్టయిల్ విభాగంలో 11 మందిని రెజ్లర్లను ఎంపిక చేశారు. వీరిలోఅమన్ షెరావత్(57కి), యశ్(74కి), దీపక్పునియా(86కి), వికీ(97కి), సుమిత్ మాలిక్(125కి) ఉన్నారు.
తన గైర్హాజరీపై బజరంగ్ స్పందిస్తూ ‘ఇటీవలే చేతి వేలుకు సర్జరీ అయ్యింది. దీంతో ఇప్పటికీ ప్రాక్టీస్ మొదలుపెట్టలేకపోయాను. సరైన సన్నద్ధత లేకుండా టోర్నీలో పోటీపడలేను. త్వరలోనే ఫిట్నెస్పై దృష్టి పెడుతాను’ అని ఉంది. మరోవైపు మహిళల విభాగంలో సోనమ్ మాలిక్(62కి), రాధిక(68కి) ఇద్దరు మాత్రమే పోటీపడుతున్నారు.