హైదరాబాద్: పదకొండవ హైదరాబాద్ ఓపెన్ టెన్నిస్ టోర్నీ(హెచ్వోటీఏ)కి శుక్రవారం తెరలేచింది. సికింద్రాబాద్ క్లబ్ వేదికగా హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ టోర్నీని అధికారికంగా ప్రారంభించారు. నాలుగు రోజుల పాటు జరిగే టోర్నీలో వివిధ కేటగిరీల్లో మొత్తం 337 మంది ప్లేయర్లు బరిలోకి దిగుతున్నారు. ప్రారంభ కార్యక్రమంలో హెచ్వోటీఏ అధ్యక్షుడు నంద్యాల నరసింహారెడ్డి, సికింద్రాబాద్ క్లబ్ ప్రెసిడెంట్ రఘురామ్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.