హైదరాబాద్, నమస్తే తెలంగాణ: దక్షిణకొరియాలో ఇటీవల జరిగిన అంతర్జాతీయ ఆసియా-పసిఫిక్ మాస్టర్స్ గేమ్స్ లో రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(టీఎస్ఆర్టీసీ) ఉద్యోగులు సత్తా చాటారు. సంస్థకు చెందిన అంజలి, కిషన్ ఆర్చరీలో రెండు పతకాలు కొల్లగొట్టారు.
జీడిమెట్ల డిపో కండక్టర్ ఎం అంజలి ఆర్చరీ 18 మీటర్ల విభాగంలో స్వర్ణ పతకం గెలుపొందగా.. కరీంనగర్ జోనల్ వర్షాప్ మెకానిక్ కే కిషన్ 30 మీటర్ల విభాగంలో రజత పతకం సాధించాడు. పతకాలు సాధించిన అంజలి, కిషన్ను మంగళవారం బస్భవన్లో సంస్థ ఎండీ వీసీ సజ్జనార్ అభినందించారు.