హైదరాబాద్, ఆట ప్రతినిధి: భారత్, ఇంగ్లండ్ మధ్య ఐదు టెస్టుల సిరీస్లో భాగంగా వచ్చే నెల 25న తొలి మ్యాచ్కు హైదరాబాద్ ఆతిథ్యమివ్వనుంది. ఈ నేపథ్యంలో రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్బాబును శనివారం హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్(హెచ్సీఏ) అధ్యక్షుడు జగన్మోహన్రావు మర్యాదపూర్వకంగా కలిశారు.
వచ్చే నెలలో జరుగనున్న టెస్టు మ్యాచ్కు అవసరమైన భద్రతా ఏర్పాట్లపై చర్చించారు. మ్యాచ్ను సజావుగా నిర్వహించేందుకు సహకారం అందించాల్సిందిగా సీపీని జగన్ కోరారు. మంగళవారం స్టేడియాన్ని పరిశీలిస్తానని ఆయన పేర్కొన్నారు. సీపీని కలిసిన వారిలో జగన్తో పాటు హెచ్సీఏ కార్యదర్శి దేవ్రాజ్, ఉపాధ్యక్షుడు దల్జీత్సింగ్, బసవరాజు, శ్రీనివాస్ ఉన్నారు.