మాలె: దక్షిణాసియా ఫుట్బాల్ (సాఫ్) చాంపియన్షిప్లో భారత్ నిరాశాజనక ప్రదర్శన కొనసాగుతున్నది. బంగ్లాదేశ్తో ఆడిన తొలి మ్యాచ్ను ‘డ్రా’ చేసుకున్న భారత్.. గురువారం శ్రీలంకతో జరిగిన మ్యాచ్ను 0-0తో ‘డ్రా’గా ముగించింది. అందివచ్చిన అవకాశాలను చేజార్చుకున్న ఛెత్రీ సేన.. అందుకు తగ్గ మూల్యం చెల్లించుకుంది. ప్రపంచ ర్యాంకింగ్స్లో 205వ స్థానంలో ఉన్న లంక.. 107 ప్లేస్లో ఉన్న భారత్ను ఆద్యంతం అడ్డుకుంది. ఐదు దేశాలు పోటీ పడుతున్న ఈ టోర్నీలో భారత్ రెండు పాయింట్లతో మూడో స్థానంలో ఉండగా.. ఆడిన రెండు మ్యాచ్ల్లోనూ నెగ్గిన నేపాల్ 6 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతున్నది. తదుపరి మ్యాచ్లో ఆదివారం నేపాల్తో భారత్ తలపడుతుంది.