కేప్టౌన్: మూడు మ్యాచ్ల సిరీస్లో భాగంగా మంగళవారం నుంచి ప్రారంభం కానున్న ఆఖరి టెస్టు కోసం భారత క్రికెట్ జట్టు శనివారం కేప్టౌన్ చేరుకుంది. దీనికి సంబంధించిన వీడియోను బీసీసీఐ ట్విట్టర్లో పోస్ట్ చేసింది. సెంచూరియన్ వేదికగా జరిగిన తొలి టెస్టులో టీమ్ఇండియా విజయం సాధించగా.. జొహన్నెస్బర్గ్ పోరులో దక్షిణాఫ్రికా గెలుపొందింది. దీంతో ప్రస్తుతం ఇరు జట్లు 1-1తో సమ ఉజ్జీలుగా ఉన్నాయి. ఇక నిర్ణయాత్మక మూడో పోరులో విజయం సాధించిన వారు ‘ఫ్రీడమ్ సిరీస్’ చేజిక్కించుకోనున్నారు. గాయం కారణంగా రెండో టెస్టుకు దూరమైన భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ.. ఈ మ్యాచ్కు అందుబాటులో ఉండనున్నాడు. మరోవైపు రెండో టెస్టు సందర్భంగా కండరాల గాయంతో పూర్తిస్థాయి ప్రదర్శన కనబర్చలేకపోయిన హైదరాబాదీ పేసర్ మహమ్మద్ సిరాజ్ ఫిట్నెస్ విషయంలో ఇంకా స్పష్టత రాలేదు.