అల్మటి: టోక్యో ఒలింపిక్స్కు అర్హత సాధించే అవకాశాన్ని భారత అగ్రశ్రేణి గ్రీకో రోమన్ రెజ్లర్ సునీల్ కుమార్ చేజార్చుకున్నాడు. శుక్రవారం ఇక్కడ జరిగిన ఆసియా క్వాలిఫయర్స్ సెమీస్లో సునీల్ (87 కేజీలు) 5-9 తేడాతో సుక్రోబ్ అబ్దుల్ఖేవ్ (కిర్గిస్థాన్) చేతిలో ఓడాడు. ఈ టోర్నీ ఫైనల్ చేరి ఉంటే టోక్యో బెర్త్ పక్కా కాగా.. ఒక్క అడుగుదూరంలో అతడు నిలిచిపోయాడు. అలాగే జ్ఞానేందర్ (60కేజీలు), అషు (67 కేజీలు), గుర్ప్రీత్ సింగ్ (77 కేజీలు), నవీన్ (130 కేజీలు) కూడా సెమీస్లో ఓటమిపాలయ్యారు. దీంతో గ్రీకో రోమన్లో భారీ నిరాశ ఎదురైంది.