న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం కరోనా నిర్వహణపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మంగళవారం శ్వేతపత్రం విడుదల చేశారు. ఇది ప్రభుత్వాన్ని విమర్శించడానికి కాదు రాబోయే మూడో వేవ్కు సంసిద్ధం కావడానికి సాయం చేసేందుకే అని ఈ సందర్భంగా రాహుల్ అన్నారు. కరోనా థర్డ్ వేవ్ వస్తోందని ప్రజలందరికీ తెలుసు. దానికోసం ప్రభుత్వం సిద్ధం కావాలనే కోరుతున్నాం అని చెప్పారు.
కరోనా తొలి, రెండో వేవ్ల సమయంలో ప్రభుత్వం వ్యవహరించిన తీరు దారుణంగా ఉన్నదని రాహుల్ అభిప్రాయపడ్డారు. దీని వెనుక కారణాలను కూడా మేము చెప్పే ప్రయత్నం చేశాం. వైరస్ మ్యుటేట్ అవుతున్న కారణంగా థర్డ్ వేవే కాదు మరిన్ని వేవ్లు వస్తాయని కూడా అంచనా వేసి చెప్పాను అని రాహుల్ అన్నారు.