సికింద్రాబాద్, మే 13: సీతాఫల్మండి కుట్టివెల్లోడి దవాఖానలో వేస్తున్న కొవిడ్ టీకాలను మల్టీపర్పస్ ఫంక్షన్హాల్ పక్కనున్న క్యాంపు కార్యాలయంలో వేసేలా ఏర్పాట్లు చేస్తున్నామని డిప్యూటీ స్పీకర్ పద్మారావుగౌడ్ తెలిపారు. క్యాంపు కార్యాలయ ఆవరణలో టీకా కేంద్రాన్ని ఏర్పాటు చేయడంతో కుట్టివెల్లోడి దవాఖానలో కొవిడ్ టెస్ట్లు చేసేందుకు అవకాశం ఉంటుందన్నారు. గురువారం డిప్యూటీ స్పీకర్తో పాటు దవాఖాన ఇన్చార్జి విజయ, కార్పొరేటర్ సామలహేమ క్యాంపు కార్యాలయాన్ని పరిశీలించారు. ఆయన మట్లాడుతూ టీకాలు, టెస్ట్లు ఒకేచోట నిర్వహించడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారని తెలిపారు. దీనికితోడు టీకాలు వేసుకునే సమయంలో తోపులాట జరుగుతున్నదని చెప్పారు. టీకా కేంద్రాన్ని మార్చడంతో ప్రజలకు సౌకర్యంగా ఉంటుందన్నారు. శుక్రవారం నుంచి కేంద్రం అందుబాటులోకి వస్తుందని పద్మారావు తెలిపారు.