Xiaomi Redmi Note 14 SE 5G | బడ్జెట్ ధరలోనే ఆకట్టుకునే ఫీచర్లు కలిగిన స్మార్ట్ ఫోన్లను తయారు చేసి అందించడంలో షియోమీ ఎంతగానో పేరుగాంచింది. ఇప్పటికే కొన్ని కోట్ల మంది వినియోగదారులు ఈ సంస్థకు ఏర్పడ్డారు. ఈ క్రమంలోనే షియోమీ లేటెస్ట్గా మరో నూతన స్మార్ట్ ఫోన్ను బడ్జెట్ ధరకే లాంచ్ చేసింది. రెడ్మీ నోట్ 14 ఎస్ఈ 5జి పేరిట ఈ ఫోన్ను భారత్లో విడుదల చేసింది. ఇందులో పలు ఆకట్టుకునే ఫీచర్లను అందిస్తున్నారు. ఈ ఫోన్లో 6.67 ఇంచుల సూపర్ అమోలెడ్ డిస్ప్లేను ఏర్పాటు చేశారు. దీనికి ఫుల్ హెచ్డీ ప్లస్ రిజల్యూషన్, 120 హెడ్జ్ రిఫ్రెష్ రేట్ లభిస్తుంది. అందువల్ల డిస్ప్లే చాలా క్వాలిటీగా ఉంటుందని చెప్పవచ్చు. తెరపై అద్భుతమైన దృశ్యాలను వీక్షించవచ్చు. ఈ డిస్ప్లేకు గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్ను అందిస్తున్నారు. ఈ ఫోన్లో మీడియాటెక్ డైమెన్సిటీ 7025 ఆక్టాకోర్ ప్రాసెసర్ను ఏర్పాటు చేశారు.
ఈ ఫోన్లో 6జీబీ ర్యామ్ లభిస్తుంది. 128జీబీ స్టోరేజ్ ఆప్షన్లో ఈ ఫోన్ను లాంచ్ చేశారు. ఈ ఫోన్లో స్టోరేజ్ను మైక్రో ఎస్డీ కార్డు ద్వారా పెంచుకోవచ్చు. ఆండ్రాయిడ్ 15 ఆపరేటింగ్ సిస్టమ్ లభిస్తుంది. హైబ్రిడ్ డ్యుయల్ సిమ్ స్లాట్ను ఇచ్చారు. వెనుక వైపు 50 మెగాపిక్సల్ మెయిన్ కెమెరా ఉంది. మరో 8 మెగాపిక్సల్ అల్ట్రావైడ్ కెమెరాను, 2 మెగాపిక్సల్ మాక్రో కెమెరాను ఏర్పాటు చేశారు. ముందు వైపు 20 మెగాపిక్సల్ కెమెరా లభిస్తుంది. ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ను ఏర్పాటు చేశారు. ఇన్ ఫ్రారెడ్ సెన్సార్ కూడా లభిస్తుంది. 3.5ఎంఎం ఆడియో జాక్ను ఇచ్చారు. డాల్బీ అట్మోస్ ఫీచర్ ఉంది. అందువల్ల సౌండ్ చాలా క్వాలిటీగా ఉంటుంది.
ఈ ఫోన్కు గాను ఐపీ64 డస్ట్ అండ్ స్ల్పాష్ రెసిస్టెంట్ ఫీచర్ను అందిస్తున్నారు. ఇందులో 5జి సేవలను పొందవచ్చు. డ్యుయల్ 4జి వీవోఎల్టీఈ ఫీచర్ కూడా ఉంది. డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.3, యూఎస్బీ టైప్ సి వంటి అదనపు ఫీచర్లను సైతం అందిస్తున్నారు. ఇక ఈ ఫోన్లో 5110 ఎంఏహెచ్ భారీ కెపాసిటీ ఉన్న బ్యాటరీని ఏర్పాటు చేశారు. దీనికి 45 వాట్ల ఫాస్ట్ చార్జింగ్ ఫీచర్ లభిస్తుంది. అందువల్ల ఫోన్ను వేగంగా చార్జింగ్ చేసుకోవచ్చు.
రెడ్మీ నోట్ 14 ఎస్ఈ 5జి స్మార్ట్ ఫోన్కు చెందిన సింగిల్ వేరియెంట్ 6జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజ్ మోడల్ ధర రూ.14,999గా ఉంది. ఈ ఫోన్ను ఫ్లిప్కార్ట్తోపాటు ఎంఐ ఆన్ లైన్ స్టోర్లో, అన్ని రిటెయిల్ స్టోర్స్లో ఆగస్టు 7 నుంచి విక్రయించనున్నారు. లాంచింగ్ సందర్భంగా ఈ ఫోన్పై క్యాష్ బ్యాక్ను అందిస్తున్నారు. అన్ని మేజర్ బ్యాంకు కార్డులతో ఈ ఫోన్ను కొనుగోలు చేస్తే రూ.1000 ఇన్ స్టంట్ క్యాష్ బ్యాక్ ఇస్తారు. అలాగే రూ.1000 వరకు అదనపు ఎక్స్ఛేంజ్ బోనస్ను సైతం అందిస్తున్నారు.