న్యూఢిల్లీ : స్మార్ట్ఫోన్ కెమెరాలు గతంలో 8 మెగా పిక్సెల్ (ఎంపీ) నుంచి 16 ఎంపీకి మెరుగవగా ప్రస్తుతం 200 కెమెరా సెన్సర్ల వరకూ మొబైల్ సెగ్మెంట్ ఎదిగింది. ఇక శాంసంగ్ గెలాక్సీ ఎస్23 సిరీస్ సోనీ నుంచి 200ఎంపీ సెన్సర్లతో కస్టమర్లను ఆకట్టుకుంటుండగా స్మార్ట్ఫోన్ ఫొటోగ్రఫీని చైనా స్మార్ట్ఫోన్ తయారీ కంపెనీ షియామి కొత్తపుంతలు తొక్కిస్తోంది.
స్మార్ట్ఫోన్ ఫొటోగ్రఫీని నెక్ట్స్ లెవెల్కు తీసుకువెళ్లేందుకు లీకా కెమెరాతో షియామి చేతులు కలిపింది. మొబైల్ ఫోన్లకు డీఎస్ఎల్ఆర్ తరహా కెమెరా సామర్ధ్యాలను లీకా తీసుకురానుంది. ఈ దిగ్గజ కంపెనీల వ్యూహాత్మక భాగస్వామ్యంతో షియామి 12ఎస్ అల్ట్రాను తొలి స్మార్ట్ఫోన్గా గత ఏడాది ఆవిష్కరించారు. ఈ భాగస్వామ్యంతో తదుపరి ప్రోడక్ట్గా షియామి 13 ప్రోను డెవలప్ చేయగా ఈ స్మార్ట్ఫోన్ ఫిబ్రవరి 26న లాంఛ్ కానుంది.
ఆప్టికల్ పెర్పామెన్స్ను మెరుగుపరచడంతో పాటు స్మార్ట్ఫోన్ కెమెరా మాడ్యూల్ సెగ్మెంట్లో మెరుగైన సొల్యూషన్స్ చేపట్టేందుకు లీకాతో చేతులు కలిపామని షియామి వెల్లడించింది. జర్మనీకి చెందిన కెమెరా తయారీ కంపెనీ లీకా హైఎండ్ కెమెరాలు, లెన్స్ల తయారీలో అత్యంత నైపుణ్యాలు కలిగిన సంస్ధగా పేరొందింది. షియామితో భాగస్వామ్యంతో స్మార్ట్ఫోన్లకు డీఎస్ఎల్ఆర్ తరహా సామర్ధ్యాలను తీసుకువచ్చేందుకు లీకా కసరత్తు సాగిస్తోంది.లీకాతో భాగస్వామ్యం ద్వారా రాబోయే రోజుల్లో షియామి ఫోన్లలో ఆప్టికల్ ఇంజనీరింగ్, డిజైన్, ఇమేజింగ్ సాఫ్ట్వేర్, ఫొటోగ్రఫీ ఫీచర్లు అత్యాధునిక టెక్నాలజీతో కూడిఉంటాయని షియామి చెబుతోంది.