ప్రపంచవ్యాప్తంగా ఎక్కువగా వాడే స్మార్ట్ఫోన్లు చైనా నుంచే ఉత్పత్తి అవుతున్నాయి. జియోమీ బ్రాండ్ నుంచి వివో, ఒప్పో, వన్ప్లస్ లాంటి చాలా స్మార్ట్ఫోన్ బ్రాండ్స్ చైనాకు చెందినవే. భారత్లో కూడా ఎక్కువగా చైనీస్ ఫోన్లకే డిమాండ్ ఉంటుంది.
ఈనేపథ్యంలో భారత మార్కెట్ను మరింతగా క్యాష్ చేసుకునేందుకు చైనాకు చెందిన ప్రముఖ బ్రాండ్స్ జియోమీ, వివో, ఒప్పో.. దేశీయ స్మార్ట్ఫోన్ తయారీ కంపెనీలతో ఒప్పందం చేసుకోనున్నాయి.
మన దేశంలో తయారయ్యే లావా కంపెనీతో చైనా కంపెనీలు మంతనాలు జరుపుతున్నాయి. అలాగే డిక్సాన్ టెక్నాలజీస్ అనే మరో కంపెనీతో కూడా ఒప్పందం కోసం చర్చలు నడుస్తున్నాయి.
ఈ కంపెనీలతో ఒప్పందం కుదిరితే.. భారత్లో ఆయా కంపెనీలు తమ మ్యానుఫాక్చరింగ్ యూనిట్స్ను నెలకొల్పనున్నాయి. ఇక్కడే ఫోన్లను తయారు చేసి ప్రపంచవ్యాప్తంగా ఎక్స్పోర్ట్ చేయనున్నాయి.
2022 సంవత్సరం పూర్తయ్యే లోపు భారత్లో వివో ప్లాంట్స్ను ఏర్పాటు చేసి.. ఇతర దేశాలకు వివో ఫోన్లకు ఎక్స్పోర్ట్ చేసే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది.
మరోవైపు యూఎస్, చైనా మధ్య కోల్డ్ వార్ నడుస్తున్న విషయం తెలిసిందే. ఈనేపథ్యంలోనే మరో సేఫ్ జోన్లో ఉండి.. చైనాలో ఎటువంటి గడ్డు పరిస్థితులు ఎదురైనా ప్రత్యామ్నాయంగా భారత్లో ప్లాంట్స్ ద్వారా ఎక్స్పోర్ట్ చేయాలనే ఆలోచనతోనే భారత్లో అడుగుపెట్టేందుకు ప్రముఖ బ్రాండ్స్ ఉత్సాహం చూపిస్తున్నట్టుగా టెక్ నిపుణులు అంచనా వేస్తున్నారు.