న్యూఢిల్లీ : షియోమి వచ్చే ఏడాది ఆరంభంలో రెండు మినీ స్మార్ట్ఫోన్లను లాంఛ్ చేసేందుకు కసరత్తు సాగిస్తోంది. రెండు మినీ స్మార్ట్ఫోన్లు ప్రస్తుతం అభివృద్ధి దశలో ఉన్నాయని రాబోయే నెలల్లో వీటిని లాంఛ్ చేసేందుకు షియోమి సన్నాహాలు చేస్తోంది.
ఈ స్మార్ట్ఫోన్లపై కంపెనీ ఎలాంటి సమాచారం వెల్లడించకున్నా షియోమి మోడల్ నంబర్ ఎల్3, ఎల్3ఏ ఎంఐయూఐ కోడ్పై తయారవుతున్నాయని గిజ్మోచైనా తెలిపింది. ఈ మినీ స్మార్ట్ఫోన్లు క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 870 చిప్సెట్స్తో ముందుకొస్తాయని, మోడల్ ఎల్3 ఫోన్ 6.3 ఇంచ్ డిస్ప్లేను కలిగిఉందని పేర్కొంది.