BRS USA : తెలంగాణ ప్రదాత కేసీఆర్(KCR) క్యాంప్ కార్యాలయంపై దాడిని బీర్ఎస్ యూఎస్ఏ(BRS USA) శ్రేణులు ఖండించాయి. స్వరాష్ట్ర కలను సాకారం చేసిన కేసీఆర్ను రాజకీయంగా ఎదుర్కోలేక.. గజ్వేల్లోని గులాబీ అధినేత క్యాంప్ కార్యాలయంపై కాంగ్రెస్ రౌడీ మూకలు దాడి చేయడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ న్యూయార్కులోని టైమ్స్ స్క్వేర్ వద్ద నాయకులు నిరసన తెలిపారు.
ఈ నిరసన కార్యక్రమంలో బీఆర్ఎస్ ఎన్నారై నాయకులు మహేష్ బిగాల, మహేష్ తన్నీరు, డా. యర్రంరెడ్డి తిరుపతి రెడ్డి, రవిందర్ దొన్నపనేని, నర్సింహరావు నాగులవంచ, భాస్కర్ పిన్న, రజనీకాంత్ కొసనం, కిషోర్ రెడ్డి, కొండల్ పొలసాని, శ్రీనివాస్ రెడ్డి జక్కిరెడ్డి, రిషి, సంతోష్ రోకండ్ల, ప్రవీణ్ రెడ్డి, బుచిబాబు, తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమం తర్వాత కొలంబియా యూనివర్సిటీలోని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెజిడెంట్ కేటీఆర్ ఉపన్యాస కార్యక్రమానికి వీరంతా హాజరయ్యారు.