ప్రముఖ స్మార్ట్ఫోన్ బ్రాండ్ జియోమీ.. తాజాగా స్మార్ట్ గ్లాసెస్ను రిలీజ్ చేసింది. జియోమీ బ్రాండ్ నుంచి వచ్చిన మొదటి స్మార్ట్ గ్లాసెస్ ఇవి. ఇవి చూడటానికి సాధారణమైన సన్గ్లాసెస్ లాగానే ఉంటాయి. కానీ.. ఇవి సెన్సార్లతో వర్క్ అవుతాయి. ఇమేజ్ సిస్టమ్తో ఇవి పలు స్మార్ట్ ఫీచర్లను ఎనేబుల్ చేస్తాయి. ఇవి చాలా లైట్ వెయిట్తో ఉంటాయి. ఈ స్మార్ట్ గ్లాస్ బరువు 51 గ్రాములు మాత్రమే.
దీంట్లో మైక్రో ఎల్ఈడీ ఆప్టికల్ వేవ్గైడ్ టెక్నాలజీని ఇంటిగ్రేట్ చేశారు. దీని వల్ల.. మెసేజ్లు, నోటిఫికేషన్లు కళ్ల ముందే కనిపిస్తాయి. అలాగే.. ఈ స్మార్ట్ గ్లాసెస్ను ఉపయోగించి కాల్స్ చేసుకోవచ్చు. నావిగేషన్ సెట్ చేసుకోవచ్చు, ఫోటోలు తీయొచ్చు. కళ్ల ముందు ఉన్న టెక్స్ట్ను ట్రాన్స్లేట్ కూడా చేసుకోవచ్చు.
స్మార్ట్ గ్లాసెస్ను అయితే జియోమీ కంపెనీ రిలీజ్ చేసింది కానీ.. దాని ధర, అందుబాటులోకి వచ్చే తేదీని మాత్రం ఇంకా ప్రకటించలేదు. అయితే.. ముందుగా ఈ గ్లాసెస్ చైనాలో అందుబాటులోకి రానున్నాయి. ఆ తర్వాత ప్రపంచవ్యాప్తంగా ఈ గ్లాసెస్ అందుబాటులోకి రానున్నాయి. 5 ఎంపీ కెమెరాను ఈ స్మార్ట్ గ్లాసెస్లో ఇంటిగ్రేట్ చేశారు. ఆండ్రాయిడ్ ఓఎస్తో ఈ గ్లాసెస్ రన్ అవుతాయి. క్వాడ్ కోర్ ఏఆర్ ఎమ్ ప్రాసెసర్, టచ్ పాడ్, వైఫై, బ్లూటూత్ లాంటి ఫీచర్లతో ఈ గ్లాసెస్ రానున్నాయి. వాయిస్ కమాండ్స్ కోసం జియోమీ ఏఐ అసిస్టెంట్ను ఈ స్మార్ట్ గ్లాసెస్లో ఇంటిగ్రేట్ చేసింది.
ఈ స్మార్ట్ గ్లాసెస్.. ఇటీవలే ఫేస్బుక్ రే బాన్ పేరుతో లాంచ్ చేసిన స్మార్ట్ గ్లాసెస్కు పోటీగా జియోమీ దీన్ని రిలీజ్ చేసింది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి : Apple iPhone 13 Launch Event : ఈరోజే యాపిల్ ఐఫోన్ 13 లాంచ్ ఈవెంట్.. లైవ్ ఎలా చూడాలి?
OnePlus Buds Z2: వన్ప్లస్ బడ్స్ జెడ్2 డిజైన్ లీక్.. రిలీజ్ డేట్ ఎప్పుడంటే?