న్యూఢిల్లీ : భారత్లో రెడ్మి 10 లైనప్లో తాజాగా 10 ప్రైమ్+ 5జీ బడ్జెట్ ఫోన్ను షియామి త్వరలో లాంఛ్ చేయనుంది. దేశీ మార్కెట్లో ఇప్పటికే రెడ్మి 10, రెడ్మి 10 ప్రైమ్, రెడ్మి 10 పవర్, రెడ్మి 10ఏ స్మార్ట్ పోన్లు అందుబాటులో ఉన్నాయి. రెడ్మి 10 ప్రైమ్+ 5జీ బడ్జెట్ ఫోన్ను లాంఛ్ చేసేందుకు కంపెనీ సన్నాహాలు చేపట్టింది.
లేటెస్ట్ రెడ్మి ఫోన్ 6.5 ఇంచ్ డిస్ప్లే, ఫుల్ హెచ్డీ+ రిజల్యూషన్తో కస్టమర్ల ముందుకు రానుంది. రెడ్మి 10 ప్రైమ్+ 5జీ ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటి 700 చిప్సెట్తో ఆండ్రాయిడ్ 12 అవుటాఫ్ ది బాక్స్ ఓఎస్పై రన్ అవుతుంది. రెడ్మి 10 ప్రైమ్+ 5జీ డ్యూయర్ రియర్ కెమెరా సెటప్తో పాటు, 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 2 మెగాపిక్సెల్ కెమెరాతో ఆకట్టుకోనుంది.
సెల్ఫీల కోసం ముందుభాగంలో 5 మెగాపిక్సెల్ కెమెరా అమర్చారు. లేటేస్ట్ స్మార్ట్ఫోన్ 18డబ్ల్యూ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్తో 5000ఎంఏహెచ్ బ్యాటరీ సామర్ధ్యం కలిగిఉంది. రెడ్మి 10 ప్రైమ్+ 5జీ భారత్లో రూ 10,000 నుంచి రూ 15,000 మధ్య అందుబాటులో ఉంటుందని భావిస్తున్నారు.