న్యూఢిల్లీ : షియామి ఏప్రిల్ 18న మరో ఫ్లాగ్షిప్ ఫోన్ షియామి 13 అల్ట్రా (Xiaomi 13 Ultra) లాంఛ్ చేస్తోంది. షియామి ప్రీమియం స్మార్ట్ఫోన్తో పాటు అదేరోజు షియామి ప్యాడ్ 6ను కూడా కంపెనీ లాంఛ్ చేస్తోంది. స్మార్ట్ఫోన్ గ్లోబల్ లాంఛ్ను షియామి తన అధికారిక సోషల్ మీడియా ఖాతాలో ధ్రువీకరించింది. షియామి గతంలో భారత్లో ఫ్లాగ్షిప్ ఫోన్గా షియామి 13ను లాంఛ్ చేసింది.
రూ. 79,900 ప్రారంభ ధరతో దేశీ మార్కెట్లో షియామి ఈ స్మార్ట్ఫోన్ను లాంఛ్ చేసింది. ఇక షియామి 13 అల్ట్రా ఫీచర్ల విషయానికి వస్తే..లేటెస్ట్ స్మార్ట్ఫోన్ 6.7 ఇంచ్ అమోల్డ్ డిస్ప్లే, క్వాల్కాం స్నాప్డ్రాగన్ 8 జెన్ 2 చిప్సెట్తో కస్టమర్ల ముందుకు రానుంది. ఈ స్మార్ట్ఫోన్ ఎంఐయూఐ 14 లేయర్డ్తో కూడిన ఆండ్రాయిడ్ 13 ఓఎస్పై రన్ అవుతుంది.
షియామి 13 అల్ట్రా లీకా బ్రాండెడ్ కెమెరా లెన్సులతో 50 ఎంపీ సోనీ ఐఎంఎక్స్989 సెన్సర్, మూడు 50ఎంపీ సెన్సర్లతో కూడిన క్వాడ్ కెమెరా సెటప్తో ఆకట్టుకోనుంది. సెల్ఫీల కోసం ఈ స్మార్ట్ఫోన్ 32 ఎంపీ కెమెరాను కలిగిఉంది. ఇక 90డబ్ల్యూ చార్జింగ్ సపోర్ట్తో ఈ స్మార్ట్ఫోన్ 4900ఎంఏహెచ్ బ్యాటరీ సామర్ధ్యం కలిగిఉంది.
Read More