ఎలిగేడు, ఏప్రిల్ 26: కొనుగోలు కేంద్రాల్లోనే రైతులకు మద్దతు ధర లభిస్తున్నదని ఎంపీపీ తానిపర్తి స్రవంతి తెలిపారు. ముప్పిరితోట, బురహన్మియాపేటలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఎంపీపీ, ఆ గ్రామాల సర్పంచులు పెద్దోల్ల అయిలయ్య, రాచర్ల కొండయ్యరాజాతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, రైతుల ప్రయోజనాలను కాంక్షించిన సీఎం కేసీఆర్ ధాన్యం నిరంతరాయంగా కొనాలనే కృతనిశ్చయంతో ఉన్నారన్నారు. ఇక్కడ టీఆర్ఎస్ మండల మాజీ అధ్యక్షుడు తానిపర్తి మోహన్రావు, ఎంపీటీసీలు నారగోని ఎల్లమ్మ, ఏపీఎం సుధాకర్, హమాలీలు, రైతులు తదితరులున్నారు.
తాలు లేకుండా తీసుకురావాలి
మంథని టౌన్, ఏప్రిల్ 26: రైతులు తమ ధాన్యాన్ని తాలు లేకుండా కొనుగోలు కేంద్రానికి తీసుకు రావాలని మంథని ఏఎంసీ చైర్మన్ శ్రీరాంభట్ల సంతోషిణి సూచించారు. స్థానిక ఏఎంసీ కార్యాలయంలోని కాంటాకు వచ్చిన ధాన్యాన్ని ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, సరైన తేమ శాతం ఉన్న ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేస్తారని వివరించారు. కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో మాస్కులు ధరించాలని సూచించారు.
జూలపల్లి, ఏప్రిల్ 26 : అబ్బాపూర్లోని పోశమ్మ గుట్టల వద్ద ధర్మారం మండలం పత్తిపాక సింగిల్ విండో ఆధ్వర్యంలో సోమవారంధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సర్పంచ్ వీర్ల మల్లేశం ప్రారంభించారు. ఇక్కడ ఎంపీటీసీ సభ్యుల ఫోరం మండలాధ్యక్షుడు దండె వెంకటేశం, పత్తిపాక సింగిల్ విండో చైర్మన్ నోముల వెంకటరెడ్డి, ఉప సర్పంచ్ నాగిరెడ్డి రాజవ్వ, వైస్ చైర్మన్ పసునూటి శ్రీనివాస్, డైరెక్టర్లు జంగం సతీశ్, బైర రాజమల్లు, నిమ్మ మల్లయ్య, ఆర్ఐ అమ్జద్, వీఆర్వో రాజనర్సు, సీఈవో తుర్తి బుచ్చయ్య, నాయకులు అడిశెర్ల రాజేశం, పప్పు కుమార్, బొమ్మనవేని అంజయ్య తదితరులు పాల్గొన్నారు.
సుల్తానాబాద్ రూరల్, ఏప్రిల్ 26 : కందునూరిపల్లిలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సర్పంచ్ పన్నాల స్వరూప తిరుపతి ప్రారంభించారు. పీఎసీఎస్ సుల్తానాబాద్ ఆధ్వర్యంలో ఈ కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో పీఎసీఎస్ చైర్మన్ శ్రీగిరి శ్రీనివాస్, డైరెక్టర్ పన్నాల రాములు, పాలకవర్గ సభ్యులు, ఏఈవో, సీఈవో తదితరులు ఉన్నారు.