న్యూఢిల్లీ : భారత్లో వివో టీ2 5జీ ఫోన్ను వివో (Vivo T2 5G) లాంఛ్ చేసింది. రూ. 20,000లోపు ధరతో 5జీ సపోర్ట్తో వివో లేటెస్ట్ స్మార్ట్ఫోన్ బడ్జెట్ ఫోన్ ప్రియులను ఆకట్టుకుంటుంది. వివో టీ2 5జీ 6జీబీ ర్యాం, 128జీబీ స్టోరేజ్ మోడల్ భారత్లో రూ. 18,999 నుంచి అందుబాటులో ఉంటుంది
. 8జీబీ ర్యాం వేరియంట్ రూ. 20,999కి లభిస్తుంది. గ్రేడియంట్ ఫినిష్తో లేటెస్ట్ వివో ఫోన్ రెండు కలర్ వేరియంట్స్లో అందుబాటులో ఉంటుంది. ఈ స్మార్ట్ఫోన్ సేల్ ఏప్రిల్ 18 నుంచి ప్రారంభమవుతుంది. ఫ్లిప్కార్ట్లో కూడా లేటెస్ట్ వివో ఫోన్ లభిస్తుంది. వివో ఇండియా ఈ-స్టోర్, ఫ్లిప్కార్ట్లో స్మార్ట్ఫోన్ అందుబాటులో ఉంది.
లేటెస్ట్ వివో టీ2 5జీ 6.38 ఇంచ్ అమోల్డ్ డిస్ప్లే, ముందు భాగంలో వాటర్డ్రాప్ స్టైల్ నాచ్ డిస్ప్లే, సెల్పీలు, వీడియో కాల్స్ కోసం సింగిల్ కెమెరా ఉంటుంది. ఫొటోల కోసం వివో ఫోన్ వెనక భాగంలో ఓఐఎస్ సపోర్ట్తో 64 ఎంపీ కెమెరా, 2ఎంపీ సెన్సర్ ఆకట్టుకుంటాయి. ఇక ఫోన్ ముందుభాగంలో సెల్పీల కోసం 16ఎంపీ కెమెరా ఉంటుంది. వివో టీ2 5జీ 44డబ్ల్యూ చార్జింగ్ సపోర్ట్తో 4500ఎంఏహెచ్ బ్యాటరీ సామర్ధ్యం కలిగిఉంది.
Read More
Samsung | చాట్జీపీటీ తరహా ఏఐ సర్వీస్ ప్రారంభించేందుకు శాంసంగ్ సన్నాహాలు