న్యూడిల్లీ : ట్విట్టర్కు దేశీ ప్రత్యామ్నాయంగా ముందుకొచ్చిన సోషల్ మీడియా ప్లాట్ఫాం కూ 200 మంది ఉద్యోగులపై (Layoffs) వేటు వేసింది. ట్విట్టర్ ఇండియా ప్రత్యర్ధి కూ గత కొద్ది నెలలుగా 30 శాతం మంది ఉద్యోగులను సాగనంపిందని బ్లూమ్బర్గ్ రిపోర్ట్ వెల్లడించింది. గత రెండు నెలలుగా 7000 మందికిపైగా ఉద్యోగులను తొలగించిన అనంతరం 1500 మంది ఉద్యోగులతో మైక్రో బ్లాగింగ్ సైట్ను రన్ చేస్తున్నామని బిలియనీర్ ఎలన్ మస్క్ వెల్లడించిన అనంతరం కూ లేఆఫ్స్ వెల్లడికావడం గమనార్హం.
ప్రస్తుతం అంతర్జాతీయంగా నెలకొన్న స్ధూల ఆర్ధిక అంశాల నేపధ్యంలో ఉద్యోగుల సామర్ధ్యంపై కంపెనీ ప్రధానంగా దృష్టి సారిస్తూ ఉద్యోగులపై వేటుకు మొగ్గుచూపింది. తాజా లేఆఫ్స్కు ముందు 15 మంది ఉద్యోగులను గత ఏడాది కూ తొలగించింది. తన వేదికపై కంటెంట్కు సంబంధించి భారత అధికారులతో ట్విట్టర్కు ఘర్షణ వాతావరణం నెలకొనడంతో తొలుత కూ ప్రజదారణ సొంతం చేసుకుంది.
ట్విట్టర్కు ప్రత్యామ్నాయంగా పలువురు భారత సెలబ్రిటీలు కూడా కూ వైపు మళ్లారు. ఇక స్టార్టప్ ఫండింగ్ తగ్గుతున్న క్రమంలో కూ లేఆఫ్స్ నిర్ణయం తీసుకోవడం ఆందోళన రేకెత్తిస్తోంది. బాధిత ఉద్యోగులకు పరిహార ప్యాకేజ్తో పాటు హెల్త్ బెనిఫిట్స్, కొత్త ఉద్యోగాలను అన్వేషించే క్రమంలో సాయం అందచేస్తామని కంపెనీ ప్రతినిధి తెలిపారు.
Read More
Apple | యాపిల్లో నారీ శక్తి : టెక్ దిగ్గజ ఉద్యోగుల్లో 72 శాతం దేశీ మహిళలు!