న్యూఢిల్లీ : భారత్కు తయారీ విభాగాలను తరలించే దిశగా యాపిల్ (Apple) సన్నాహాలు చేపట్టిందనే వార్తల నేపధ్యంలో ఐఫోన్ 15 మోడల్స్ తయారీలో టెక్ దిగ్గజం కీలక నిర్ణయం తీసుకుంది. ఐఫోన్ 15 మోడల్స్ తయారీని భారత్ నుంచే ముమ్మరంగా చేపట్టాలని యాపిల్ కసరత్తు సాగిస్తోంది. గత రెండేండ్లలో భారత్లో ఐఫోన్స్ తయారీ ఏడు శాతం పెరిగింది.
దీంతో యాపిల్ భారత్లో లక్షకు పైగా ఉద్యోగాలను సమకూర్చింది. ఐటీ, ఎలక్ట్రానిక్స్ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ ఈ వివరాలు వెల్లడించారు. వీరిలో 72 శాతం మంది మహిళా ఉద్యోగులే ఉన్నారు. తన ఐఫోన్స్ను భారత్లో ఫాక్స్కాన్, పెగట్రాన్, విస్ట్రన్ అనే మూడు వెండార్స్ అసెంబ్లింగ్ చేస్తున్నాయి. వీటిలో ఫాక్స్కాన్లో 30,000 మంది మహిళా ఉద్యోగులు పనిచేస్తున్నారు.
మహిళా ఉద్యోగుల సగటు వయసు 21 ఏండ్లు కాగా వీరిలో తమ కెరీర్లో తొలి ఉద్యోగం చేస్తున్నవారు అధిక సంఖ్యలో ఉండటం విశేషం. కాగా, 2025 నాటికి భారత్లో ఐఫోన్ తయారీని 25 శాతానికి చేర్చాలని యాపిల్ ప్రణాళికలు రూపొందించుకుందని బ్లూమ్బర్గ్ రిపోర్ట్ ఇటీవల వెల్లడించింది.
ఇక ఈ ఏడాది యాపిల్ ఫోన్లు చైనా మోడల్స్తో పాటు అదే సమయంలో భారత్ నుంచి ఐఫోన్ మోడల్స్ విడుదల అవుతాయని భావిస్తున్నారు. భారత్లో ఐఫోన్ 11, ఐఫోన్ 12, ఐఫోన 13, ఐఫోన్ 14, ఎయిర్పాడ్స్ సహా యాపిల్ పలు డివైజ్లను తయారుచేస్తుంది. బెంగళూర్లోని విస్ట్రన్ ప్లాంట్ను టాటా సన్స్ స్వాధీనం చేసుకోనుండటంతో యాపిల్ డివైజ్లను ఇక్కడ నుంచి పెద్ద ఎత్తున ఉత్పత్తి చేపట్టనున్నారు. టాటా సన్స్ ఈ డీల్పై రూ. 5000 కోట్లు వెచ్చిస్తోందని సమాచారం.
Read More
Xiaomi 13 Ultra | మార్కెట్లోకి షియోమీ 13 ఆల్ట్రా.. ఇవీ స్పెషిఫికేషన్స్..!