Threads App | థ్రెడ్స్ను యాప్ను ఫేస్బుక్ మాతృసంస్థ మెటా ప్రారంభించింది. నేటి నుంచి యాప్ అందుబాటులోకి వస్తుందని పేర్కొంది. ఇన్స్టాగ్రామ్ అకౌంట్ను వినియోగించి లాగిన్ చేసుకోవచ్చని పేర్కొంది. ఇందులో సుమారు వర్డ్స్తో లింక్స్, ఫొటోలు, ఐదు నిమిషాల నిడివిగల వీడియోలను సైతం పోస్ట్ చేసుకోవచ్చని తెలిపింది. ఇంటర్ఆపరబుల్ సోషల్ నెట్వర్క్లకు త్వరలో అనుకూలంగా ఉండేలా థ్రెడ్పై పని చేస్తున్నామని పేర్కొంది. ఇన్స్టాగ్రామ్ తరహాలోనే ప్రపంచవ్యాప్తంగా బిలియన్ల మంది ఫొటోలు, వీడియోల ద్వారా కనెక్ట్ అవుతారని తెలిపింది. ఆలోచనలను వ్యక్తీకరించడానికి సానుకూల, సృజనాత్మక స్థలాన్ని సృష్టించడం దృష్టి పెట్టామని ఇన్స్టాగ్రామ్ పేర్కొంది. ఇన్స్టాగ్రామ్ అకౌంట్లోని వ్యక్తులను ఫోలోవర్స్ను అనుసరించవచ్చని పేర్కొంది.
ఇదిలా ఉండగా.. ఎలాన్ మస్క్ నేతృత్వంలోని ట్విట్టర్కు పోటీగా ఇటీవల మెటా సీఈవో మార్క్ జుకర్ బర్గ్ కొత్త యాప్ను తీసుకువస్తున్నట్లు ప్రకటించే విషయం తెలిసిందే. ఎలాన్ మస్క్ ట్విట్టర్ను కొనుగోలు చేసిన తర్వాత ఆయన తీసుకుంటున్న నిర్ణయాలపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల ట్విట్లర్లో ఎక్కువగా చూడకుండా పరిమితి విధించడంతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో ట్విట్టర్ తరహాలో అతను తీసుకునే నిర్ణయాల కారణంగా చాలా మంది యూజర్లు అసంతృప్తిగా ఉన్నారు. ఇటీవల ట్విట్టర్లో ట్విట్లను చూడడంలో కూడా పరిమితి విధించడంతో యూజర్లు మరింత ఆందోళనకు లోనవుతున్నారు. ఇలాంటి సమయంలో జూకర్ బర్గ్ థ్రెడ్స్ యాప్ను తీసుకొస్తున్నట్లు ప్రకటించడం సర్వత్రా చర్చనీయాంశమైంది. యాప్ విజయవంతమైతే ట్విట్టర్ భారీగా నష్టపోయే అవకాశాలున్నాయని టెక్ నిపుణులు భావిస్తున్నారు.